రేపు ఏపీలో సోమేష్ కుమార్ జాయినింగ్‌!

by Disha Web Desk 4 |
రేపు ఏపీలో సోమేష్ కుమార్ జాయినింగ్‌!
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌లో విధుల్లో చేరనున్నారు. హైకోర్టు తీర్పు, డీవోపీటీ ఉత్తర్వుల మేరకు ఆ రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డిని కలిసి జాయినింగ్ రిపోర్టు ఇవ్వనున్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణలోనే సర్వీసులో ఉన్న సోమేశ్ కుమార్ వివిధ హోదాల్లో పనిచేసి సీఎస్ బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌‌లో చేరుతున్నందున ఏ స్థాయిలో పనిచేయాలని ఉత్తర్వులు ఇచ్చినా చేయడానికి సిద్ధమైనట్లు తెలిసింది.

ఆంధ్రప్రదేశ్ కేడర్‌గా హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఆ రాష్ట్రానికి వెళ్తారా లేక రిజైన్ చేస్తారా లేక వీఆర్ఎస్ తీసుకుంటారా అనే సస్పెన్స్‌కు సోమేశ్ కుమార్ మరికొన్ని గంటల్లోనే క్లారిటీ ఇవ్వనున్నారు. ఏపీ రాష్ట్రానికి వెళ్ళడానికి సుముఖంగా లేరనే వార్తలు వినిపించినప్పటికీ పబ్లిక్ సర్వెంట్‌గా ఎక్కడైనా పనిచేయడానికి మానసికంగా సిద్ధం కావాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఆయన పదవీ కాలం ఈ ఏడాది చివరి వరకూ ఉన్నందున ఒక సంవత్సర కాలాన్ని వృథా చేసుకోవాలనే ఆలోచన లేనట్లు సమాచారం.

స్థాయితో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఏ బాధ్యతలు అప్పజెప్పినా కంటిన్యూ చేయాలనే భావనతో ఉన్నట్లు తెలిసింది. తెలంగాణ నుంచి రిలీవ్ చేయాలంటూ డీవోపీటీ లేఖ రాయడంతో మరికొన్ని గంటల్లోనే ఆయనను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. డీవోపీటీ విధించిన డెడ్‌లైన్‌కు అనుగుణంగా గురువారంలోగా అక్కడ జాయిన్ కావాల్సి ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గురువారం ఉదయమే అక్కడకు వెళ్ళి సీఎస్ జవహర్‌రెడ్డికి రిపోర్టు చేయనున్నారు.



Next Story

Most Viewed